ఇక రైల్వే టికెట్ పై రివార్డు.!
- December 07, 2017నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ప్రయాణికులకు మరో సదుపాయాన్ని కల్పిస్తోంది. నగదురహిత మాధ్యమాల ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారికి రివార్డులు ఇవ్వనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా నెలవారీ ట్రావెల్ పాస్లను కొనుగోలు చేసిన వారికి రైల్వేశాఖ 0.5శాతం డిస్కౌంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అన్రిజర్వ్డ్ కేటగిరీ ప్రయాణికులకు కూడా ఈ సదుపాయాన్ని విస్తరిస్తోంది. దీంతో పాటు నగదు రహిత టికెట్ల కొనుగోలుపై ఉచిత బీమా సౌకర్యం కూడా కల్పించనుంది. 'నగదు వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందుకే ప్రయాణికులకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. వీటి వల్ల వచ్చే ఆర్థికభారాన్ని రైల్వేశాఖ భరిస్తుంది' అని రైల్వేబోర్డు ఓ ఆంగ్ల మీడియాకు తెలిపింది. పెద్దనోట్ల రద్దు నాటికి రైల్వే టికెట్లలో 20శాతం ఉన్న డిజిటల్ లావాదేవీలు ప్రస్తుతం 60శాతానికి పెరిగాయి. అంతకుముందు ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారానే డిజిటల్ లావాదేవీలను జరపగా.. పెద్దనోట్ల రద్దు తర్వాత నుంచి దేశవ్యాప్తంగా టికెట్ కౌంటర్ల వద్ద పాయింట్ ఆఫ్ సేల్స్ మిషన్లు ఏర్పాటుచేసింది రైల్వేశాఖ. వీటి వద్ద కార్డులతో పాటు డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు