ద్రాక్షలతో మతిమరుపు మటాష్
- December 07, 2017ద్రాక్షల్లోని పోషకాలు దంతక్షయాన్ని నివారిస్తాయి. దంతాలకు బలాన్నిస్తాయి. ద్రాక్షపండ్లను తరచూ తింటే మతిమరుపు దూరం అవుతుంది. గుండె జబ్బులు దరి చేరవు. వర్షాకాలం, చలికాలంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే తేనెను రెండు స్పూన్లు తీసుకోవాలి. తేనె దగ్గును నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
క్యాబేజీ చర్మం నిగారింపును కోల్పోకుండా చేస్తుంది. క్యాలీఫ్లవర్ కూడా ఫ్లూ, జలుబును నిరోధిస్తుంది. పాలకూర శ్వాస సమస్యలను నివారిస్తుంది. నట్స్ రోజుకు అర గుప్పెడు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత క్రమంగా వుంటుంది.
* గుండె జబ్బులకు మష్రూమ్స్ మంచి మందుగా పనిచేస్తాయి. పుట్టగొడుగుల సూప్ తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. ఇందులోని లెంటిసైన్, ఎరిటడెనిన్ రక్తంలోని కొవ్వును కరిగిస్తాయి.
* ఉదయాన్నే నిద్రలేవడం.. ఉదయం 8.30 గంటల్లోపు అల్పాహారాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నడవాలి. రాత్రి భోజనం 8 గంటల్లోపు పూర్తిచేయాలి. రాత్రి పది గంటల్లోపు నిద్రించాలి. నూనె వంటకాలను అతిగా తినకపోవడం మంచిది. రోజుకు గరిష్ఠంగా రెండుసార్లు మాత్రమే టీ,కాఫీలు తీసుకోవాలి. బాగా అలసిపోయినట్లు అనిపిస్తే.. ఒక్కసారిగా బరువు పెరిగినట్లు అనిపిస్తే నిమ్మరసం తాగాలి.
వాల్ నట్స్ తినడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదంపప్పుతో శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పిస్తా పప్పులు తినడం ద్వారా కండరాల నొప్పులు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తహీనతను నివారించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..