న్యూఢిల్లీ:ఓమన్ విమాన కో పైలెట్కు లైసెన్స్ లేదని...విమానం నిలిపివేత
- December 07, 2017న్యూఢిల్లీ: వాహనం నడుపుతున్న డ్రైవరు తన డ్రైవింగ్ లైసెన్సును ఇంట్లో మరచిపోతే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించడం సర్వసాధారణం. కాని...మస్కట్ దేశానికి చెందిన ఓమన్ విమాన కోపైలెట్ లైసెన్సు లేకుండానే విమానం నడిపేందుకు విధులకు హాజరైన ఘటన న్యూఢిల్లీలో సంచలనం రేపింది. ఓమన్ విమానం న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలు దేరాల్సి ఉండగా సాధారణ తనిఖీల్లో ఆ విమాన కో పైలెట్ కు లైసెన్సు లేదని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. అంతే ఓమన్ విమానం వెళ్లేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు నిరాకరించారు. ఓమన్ ఎయిర్ కు చెందిన ఢిల్లీ- మస్కట్ విమాన కోపైలెట్ వద్ద లైసెన్సు లేకపోవడంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. లైసెన్సు లేకుండా పైలెట్లు విమానాలు నడుపుతున్న నేపథ్యంలో విమాన ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు