ఒమనీ స్టూడెంట్స్కి 50 కిలోల బ్యాగేజ్ని ప్రకటించిన ఒమన్ ఎయిర్
- December 20, 2017మస్కట్: ఒమన్ ఎయిర్, ఒమనీ స్టూడెంట్స్కి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా స్టూడెంట్స్కి 20 కిలోల బ్యాగేజ్కి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 30 కిలోల బ్యాగేజీకి ఈ ఆఫర్ అదనం. 2018 చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఒమన్ ఎయిర్. ఒమన్ ఎయిర్కి సంబంధించి అన్ని అంతర్జాతీయ డెస్టినేషన్స్కీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ కంట్రీ మేనేజర్ జమాల్ అల్ అజ్కి మాట్లాడుతూ, ఒమన్ సిటిజన్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం తమకుందని తాము మరోమారు ఈ నిర్ణయం ద్వారా చాటుకోగలిగామనీ, శెలవుల కోసం గానీ, స్టడీ కోసం గానీ, ఇతత్రా విద్యా వ్యవహారాలకు సంబంధించిగానీ విమాన ప్రయాణం చేసే ఒమన్ విద్యార్థులకు ఈ నిర్ణయం కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా