ఎల్ ఎరిష్ ఎయిర్పోర్ట్పై తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- December 20, 2017మనామా: ఈజిప్ట్లోని ఎల్ అరిష్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఓ అధికారి చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డ సంగతి తెలిసినదే. బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటనలో, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈజిప్ట్కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మినిస్ట్రీ పేర్కొంది. తమ ప్రజల భద్రత పట్ల ఈజిప్ట్ చేపడుతున్న చర్యల్ని బహ్రెయిన్ ప్రశంసించింది. తీవ్రవాదాన్ని అంతమొందించాలంటే అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకమవ్వాలని బహ్రెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..