ఎల్‌ ఎరిష్‌ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్‌

- December 20, 2017 , by Maagulf
ఎల్‌ ఎరిష్‌ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్‌

మనామా: ఈజిప్ట్‌లోని ఎల్‌ అరిష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఓ అధికారి చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డ సంగతి తెలిసినదే. బహ్రెయిన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ ఓ ప్రకటనలో, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈజిప్ట్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మినిస్ట్రీ పేర్కొంది. తమ ప్రజల భద్రత పట్ల ఈజిప్ట్‌ చేపడుతున్న చర్యల్ని బహ్రెయిన్‌ ప్రశంసించింది. తీవ్రవాదాన్ని అంతమొందించాలంటే అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకమవ్వాలని బహ్రెయిన్‌ అభిప్రాయపడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com