ఎల్ ఎరిష్ ఎయిర్పోర్ట్పై తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- December 20, 2017
మనామా: ఈజిప్ట్లోని ఎల్ అరిష్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఓ అధికారి చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డ సంగతి తెలిసినదే. బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటనలో, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈజిప్ట్కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మినిస్ట్రీ పేర్కొంది. తమ ప్రజల భద్రత పట్ల ఈజిప్ట్ చేపడుతున్న చర్యల్ని బహ్రెయిన్ ప్రశంసించింది. తీవ్రవాదాన్ని అంతమొందించాలంటే అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకమవ్వాలని బహ్రెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభలో ఆమోదం..లీక్ పాల్పడితే పదేళ్ల జైలు..రూ.10 కోట్ల జరిమానా!
- ఆగస్టు 1 నుంచి మారనున్న స్పీడ్ పోస్ట్ ఛార్జీలు..పూర్తి వివరాలు ఇవే!
- తైవాన్ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు







