జాత్యహంకార వ్యాఖ్యలు: ఇద్దరు జర్నలిస్ట్ల అరెస్ట్కి రంగం సిద్ధం
- December 28, 2017అబుదాబీ: పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఇద్దరు జర్నలిస్ట్లను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వీరు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, చట్ట వ్యతిరేకమని న్యాయస్థానం నిర్ధారించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రిమినల్ చర్యలకు వేదికగా ఉపయోగించుకోవడంపైనా న్యాయస్థానం జర్నలిస్టుల తీరుని తప్పు పట్టింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్, ప్రజలెవరూ సోషల్ మీడియాని తప్పుడు చర్యల కోసం వినియోగించరాదని విజ్ఞప్తి చేయడం జరిగింది. సొసైటీకి, పబ్లిక్ ఆర్డర్కీ చేటు కలిగించే ఎలాంటి రాతలు, బొమ్మలు, ఫొటోలు, వీడియోలు, అయినా చట్ట వ్యతిరేకమేనని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు దాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు