రవితేజ- శ్రీను వైట్ల మూవీపై అప్డేట్
- January 10, 2018మాస్ మాహారాజా రవితేజ రీ ఎంట్రీతోను అదరగొడుతున్నాడు. బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీతో మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని నిరూపించాడు. ఇక టచ్ చేసి చూడు అనే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. రీసెంట్గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇక ఈ మూవీ పూర్తైన తర్వాత నీ కోసం సినిమాతో సోలో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసి తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన శ్రీను వైట్లతో రవితేజ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి అమర్ అక్బర్ ఆంథోని అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ ని బట్టి చూస్తుంటే ఈ మూవీలో రవితేజ మూడు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడా అనే డౌట్ కలుగుతుంది. ప్రస్తుతం వైట్ల ఈ సినిమా కోసం లొకేషన్స్ సెర్చింగ్ లో ఉన్నాడట. యూఎస్ లో తన టీంతో కలిసి పలు లొకేషన్స్ సెర్చ్ చేస్తున్న దర్శకుడు ఈ చిత్రంలో రవితేజని ఎన్ఆర్ఐగా చూపించనున్నాడట. తన ట్రేడ్ మార్క్ కామెడీతో సినిమాని రూపొందించనున్న వైట్ల ఆగస్ట్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు సమాచారం.
ఈ లోపే చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేయనున్నారని టాక్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ