మొన్నేగా పెళ్లైంది.. అప్పుడే అనుష్క శర్మకు ఏమైంది
- January 10, 2018మోస్ట్ పాపులర్ కపుల్గా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విరుష్క జంట పెళ్లి అనంతరం ఎవరి రంగాల్లో వారు బిజీగా ఉన్నారు. కథానాయికగానే కాకుండా నిర్మాతగా కూడా మారి సక్సెస్ అయ్యింది. తనే నిర్మాతగా, ఆ పై హీరోయిన్గా వస్తున్న 'పరి' చిత్ర టీజర్ని ట్విటర్లో విడుదల చేసింది. అందమైన ఆమె ముఖం నిండా రక్తపు మరకలు. ఒకింత బాధ, మరి కొంత ఆవేశం ఈ చిత్రంలో కనబడుతోంది. ఈ పోస్టర్ ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అనుష్కతో పాటు రీటాభరీ చక్రవర్తి, పరంబాత్రా చటర్జీ, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం షారుక్తో 'జీరో', వరుణ్ ధావన్తో 'సూయీ ధాగా' చిత్రాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. వివాహానంతరం విరామం తీసుకున్న అనుష్క సోమవారం నుంచి షూటింగ్లో పాల్గొనబోతోంది. 'పరి' చిత్రాన్ని మార్చిలో హోలీ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకు రావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్