యు.ఏ.ఈ జాబ్ వీసా: ఇండియన్స్ కోసం యాప్
- January 23, 2018న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ని ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా, యూఏఈలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ముందుగా, హెల్త్ చెకప్, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని ఇండియాలో యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్బన్నా చెప్పారు. ఈ యాప్ ఇండియాని సందర్శించే యూఏఈ జాతీయులకు కూడా ఉపకరిస్తుందని ఆయన అన్నారు. ఇండియాలో ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలలో యూఏఈ వీసా కేంద్రాలున్నాయి. ఢిల్లీలోని కార్యాలయం గత ఏడాది 50,000 మందికి వర్క్ వీసాలను మంజూరు చేసింది. మొత్తం 1.6 మిలియన్ ఇండియన్స్ గత ఏడాదిలో యూఏఈ సందర్శించారు. యూఏఈ జాతీయుల కోసం 'త్వాజుది' అనే సర్వీస్ని యూఏఈ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా పాస్పోర్ట్ పోగొట్టుకున్న సందర్భంలో, చిల్డ్రన్ రిటర్న్ డాక్యుమెంట్, యూఏఈ సిటిజన్ ప్రెజెన్స్ అబ్రాడ్, ఎస్కార్ట్ ట్రీట్మెంట్ - మెడికల్ కేసెస్, ఫైనాన్సియల్ మేటర్స్ వంటివాటికి అత్యవసర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!