యు.ఏ.ఈ జాబ్ వీసా: ఇండియన్స్ కోసం యాప్
- January 23, 2018న్యూ ఢిల్లీలోని యూఏఈ ఎంబసీ, స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ని ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా, యూఏఈలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ముందుగా, హెల్త్ చెకప్, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందని ఇండియాలో యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్బన్నా చెప్పారు. ఈ యాప్ ఇండియాని సందర్శించే యూఏఈ జాతీయులకు కూడా ఉపకరిస్తుందని ఆయన అన్నారు. ఇండియాలో ఢిల్లీ, ముంబై, తిరువనంతపురంలలో యూఏఈ వీసా కేంద్రాలున్నాయి. ఢిల్లీలోని కార్యాలయం గత ఏడాది 50,000 మందికి వర్క్ వీసాలను మంజూరు చేసింది. మొత్తం 1.6 మిలియన్ ఇండియన్స్ గత ఏడాదిలో యూఏఈ సందర్శించారు. యూఏఈ జాతీయుల కోసం 'త్వాజుది' అనే సర్వీస్ని యూఏఈ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా పాస్పోర్ట్ పోగొట్టుకున్న సందర్భంలో, చిల్డ్రన్ రిటర్న్ డాక్యుమెంట్, యూఏఈ సిటిజన్ ప్రెజెన్స్ అబ్రాడ్, ఎస్కార్ట్ ట్రీట్మెంట్ - మెడికల్ కేసెస్, ఫైనాన్సియల్ మేటర్స్ వంటివాటికి అత్యవసర పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం