ఏపీ ఎంపీల నిరసన గళం.. మార్చి 5కు లోక్సభ వాయిదా
- February 09, 2018టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. ఐదో రోజు ఏపీ ఎంపీలు ఇంకాస్త స్వరం పెంచారు.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిసార్లు సర్ది చెప్పాలని చూసినా.. ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు.. ఏపీకి పూర్తి న్యాయం చేయాలంటూ నినాదాలతో మారుమోగించారు. దీంతో లోక్సభను మార్చి 5కు వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్..
లోక్సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ఆందోళన బాట పట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్సభను స్తంభింపజేశారు. వెల్లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. సభ మొదలవగానే ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేశారు. అయితే సభ మొదలైన 5 నిమిషాల తర్వాత ఎంపీ శివప్రసాద్ లోనికి ప్రవేశించారు. అతని వేషధారణను చూసిన స్పీకర్ సుమిత్రామహాజన్ ఏదో జరగబోతోందని భావించి సభను వాయిదా వేశారు.
తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు.. విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని, సజావుగా జరిగేందుకు సహకరించాలని సభాపతి సుమిత్రా మహాజన్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు బెట్టు వీడలేదు.. దీంతో మళ్లీ సభను 12 గంటలకు వాయిదా వేశారు.. తరువాత సభ ప్రారంభమైనా మళ్లీ అదే పరిస్థితి కనిపించింది.. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభాపతి సభను మార్చి ఐదో తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం