అబుదాబి లో 'యోగా గురు': స్పెషల్ స్టోరీ
- February 09, 2018
అబుదాబి:ఆయన పేరు జుజ్జవరపు వెంకట సుబ్రహ్మణ్యం , వయస్సు 86 , తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామ వాస్తవ్యులైన సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం అబూదాబి కి ఆయన కుమార్తె ఇంటికి విసిట్ వీసా మీద వచ్చ్చారు.
ఆయన నడక ,చురుకు దనం, చూసిన అందరూ ఆశ్చర్యం తో నిజంగా ఆయన 86 ఏళ్ళ వ్యక్తి అంటే నమ్మలేము అంటున్నారు..
ఇంతకీ ఆయన ఆరోగ్య రహస్యం ఏమని అడిగితే ఆయన చెప్పేది ఒక్కటే . క్రమ బద్ధమైన జీవనం అని అంటారు.
వృత్తి రీత్యా వ్యవసాయ దారులైన సుబ్రహ్మణ్యం గారు తెల్లవారు ఝామున 3.30 కి నిద్దుర లేసి సుమారు 30 నిమిషాలు ప్రాణాయామం చేసుకుని తదుపరి ఒక గంట సేపు యోగాసనాలు వేసుకున్న తరువాతే గాని ఆయన దిన చర్య ప్రారంభం కాదు . ఆత్రేయపురం లో ఉన్న మహాత్మా గాంధి విద్యా సంస్థల బోర్డు మెంబరుగా కూడా ఆయన సమాజానికి సేవను అందిస్తున్నారు. గోదావరి నది వడ్డున ఉన్న వారి గ్రామం లో చక్కని పైర గాలి వాతావరణంలో ఉండే ఆయన అబూ దాబి నగరంలో సెంట్రల్ ఏసీ ఇళ్లలో కొంచెం ఇబ్బంది పడినా నగరంలోని కోర్నిష్ లో చక్కగా సేద తీర్చుకున్నారు.
అబూ దాబి వచ్చాక వ్యవసాయ పనులు లేక పోయిన అదే షెడ్యూల్ ప్రకారం తెల్లవారు ఝామున 3.30 కి నిద్దుర లేసి ప్రాణాయామం , యోగా తరువాత ఉదయం 6. 30 కి ఆయన ఉదయం అల్పాహారం తీసుకుని, మధ్యాన్న భోజనం 11 గంటలకి ముగించుకుని , మళ్ళీ సాయంత్ర భోజనం 6.30 ముగించుకుంటారు .
1968 వ సంవత్సరంలో ఒక సారి ఎడమ ప్రక్క భుజంలో కొద్దిగా నొప్పి వచ్చిందని గుండె పోటు అనే అనుమానం తో భీమవరం లోని వేగిరాజు రామకృష్ణం రాజు ప్రకృతి వైద్య శాల లో పరీక్షించు కోవడానికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి కేవలం గ్యాస్ నొప్పి అని చెప్పి ప్రకృతి వైద్య విధానంతో చికిత్స చేశారు .
అప్పటి నుండి క్రమం తప్పకుండ యోగాసనాలే కాక ఆహార నియమం కూడా చాలా క్రమశిక్షణ తో పాటిస్తూ వస్తున్నారు . భోజనం తరువాత తప్పని సరిగా వజ్రాసనం వేస్తారు . దీనివల్ల జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది అని ఆయన చెప్తారు.
ఆయన అందరికి ఇచ్ఛే సలహా ఒక్కటే , ఆహారానియమావళి లో గాని, నిద్ర విషయం లో గాని క్రమశిక్షణ చాలా ముఖ్యం అని చెప్తారు.








తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









