ఏపీ ఎంపీల నిరసన గళం.. మార్చి 5కు లోక్సభ వాయిదా
- February 09, 2018టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. ఐదో రోజు ఏపీ ఎంపీలు ఇంకాస్త స్వరం పెంచారు.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిసార్లు సర్ది చెప్పాలని చూసినా.. ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు.. ఏపీకి పూర్తి న్యాయం చేయాలంటూ నినాదాలతో మారుమోగించారు. దీంతో లోక్సభను మార్చి 5కు వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్..
లోక్సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ఆందోళన బాట పట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్సభను స్తంభింపజేశారు. వెల్లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. సభ మొదలవగానే ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేశారు. అయితే సభ మొదలైన 5 నిమిషాల తర్వాత ఎంపీ శివప్రసాద్ లోనికి ప్రవేశించారు. అతని వేషధారణను చూసిన స్పీకర్ సుమిత్రామహాజన్ ఏదో జరగబోతోందని భావించి సభను వాయిదా వేశారు.
తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు.. విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని, సజావుగా జరిగేందుకు సహకరించాలని సభాపతి సుమిత్రా మహాజన్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు బెట్టు వీడలేదు.. దీంతో మళ్లీ సభను 12 గంటలకు వాయిదా వేశారు.. తరువాత సభ ప్రారంభమైనా మళ్లీ అదే పరిస్థితి కనిపించింది.. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభాపతి సభను మార్చి ఐదో తేదీకి వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్