9న మార్చి'ఏం మంత్రం వేశావే' విడుదల కానుంది:శివ కుమార్
- March 03, 2018హైదరాబాద్:విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఏ మంత్రం వేశావే. శివానీ సింగ్ నాయికగా నటించింది. గోలీసోడా ఫిలింస్ పతాకంపై శ్రీధర్ ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మల్కాపురం శివకుమార్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఏ మంత్రం వేశావే చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ..నేడు ప్రపంచమంతా అరచేతిలోని ఫోన్లోకి వచ్చేసింది. ఇలాంటి సమయంలో యువత ఎక్కువగా ఆన్లైన్ గేమింగ్లకు అలవాటు పడుతున్నారు. వాస్తవంగా తమ చుట్టూ ఇంటిలో, సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించలేకపోతున్నారు. చివరకు అన్ని రకాలుగా భవిష్యత్నూ కోల్పోతున్నారు. ఇలాంటి ఓ యువకుడిని అతనికి పరిచయమైన యువతి ఎలా మార్చింది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత బాగా చూపించింది అనేది కథాంశం. మూస చిత్రాలకు భిన్నమైన నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. పిల్లలు పెద్దలకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.తెలుగులో అతి తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత ప్రేక్షకుల్లో స్టార్ హీరోగా గుర్తింపు అందుకున్నారు. ఏ మంత్రం వేశావే పై అంచనాలు బాగా ఉన్నాయి. ఈ నెల 9న ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాం. అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దల అండతోనే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దురాశకు పోతున్నారు. చిన్న నిర్మాతలకు నష్టాలు తీసుకొస్తున్నారు. అన్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి