చనిపోయి రెండు వారాలైనా స్వదేశానికి చేరని మృతదేహం
- March 18, 2018మనామా: రెండు వారాల క్రితం ప్రాణాలు కోల్పోయిన ఫుట్బాల్ కోచ్ పార్దీవ దేహం, ఇండియాలోని కేరళ స్టేట్కి చేరుకోకపోవడంతో మృతుడి బంధువుల మానసిక వేదన రోజురోజుకీ పెరిగిపోతోంది. 'రెండు వారాల క్రితం మా ఫాదర్ ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడు ఆయన మృతదేహం స్వదేశానికి వస్తోందో అర్థం కావడంలేదు. స్పాన్సర్తో మాట్లాడానుగానీ, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కారణంగా కేసు పెండింగ్లో వుంది. ఫార్మాలిటీస్ పూర్తయ్యాకనే పార్దీవ దేహాన్ని పంపించడానికి వీలవుతుందని చెప్పారు' అంటూ మృతుడు తిలకన్ ఒండాయంకర్యాన్ తనయుడు వైషాక్ తిలకన్ చెప్పారు. 'మేం ఏమీ చేయలేని పరిస్థితుల్లో వున్నాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వైషాక్. ఆత్మహత్య కారణంగా ఫుట్ బాల్ కోచ్ చనిపోయినట్లు పోస్ట్మార్టమ్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 22న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ టాలెంట్ అకాడమీలో ఫుట్ బాల్ కోచ్గా పనిచేస్తున్న తిలకన్, ఫిబ్రవరి 4 నుంచి ఆచూకీ లేకుండా పోయారు. జెర్సీలను కొనేందుకు మనామా మార్కెట్కి వెళ్ళిన ఆయన ఆ తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాలేదు. చివరికి ఆయన మరణ వార్త తెలిసింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి