కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
- April 14, 2018డిజిటల్ లావాదేవీలను ఈజీ చేయడానికి ప్రతిష్టాత్మకమైన భీమ్ యాప్ ను ప్రధాని నరేంద్రమోడీ 2016వ సంవత్సరంలో ఆవిష్కరించారు. నగదు రహిత లావాదేవీల కోసం లాంచ్ చేసిన ప్రభుత్వ యాప్ 'భీమ్'. ఇప్పుడు భీమ్ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలను పెంచడానికి వీరికి భారీ మొత్తంలో క్యాష్బ్యాక్ ఆఫర్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూపీఐ విధానం ద్వారా పనిచేసే ఈ యాప్లో లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి. దీంతో వినియోగదారులు లావాదేవీలు అధికంగా జరిపేందుకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆఫర్తో కస్టమర్లకు నెలకు 750 రూపాయల వరకు వ్యాపారులు ఒక నెలలో రూ.1,000 వరకు అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14నుంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అమలు చేయనుంది. భీమ్ యాప్ ద్వారా మెదటి సారి రూ.100 లావాదేవీ జరిపినప్పుడు రూ.51 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా వినియోగదారులకు గరిష్టంగా రూ.750 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అదే వ్యాపారులకయితే ఒక నెలకు రూ.1000 వరకు పొందవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్