అబుదాబీ:రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- April 20, 2018అబుదాబీ: ముఫ్రాక్ బ్రిడ్జి వద్ద నాలుగు కార్లు ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. అబుదాబీ పోలీసులు చెబుతున్న వివరాల్ని బట్టి, కారు డ్రైవర్ అతి వేగంతో హైవే బ్యారియర్ని ఢీకొన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మిగతా కార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అబుదాబీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ - సీరియస్ యాక్సిడెంట్స్ హెడ్ డాక్టర్ ముస్లిమ్ మొహమ్మద్ అల్ జునైబి మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలనీ, తద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలను నివారించినట్లవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు