మనామా:పేలుడు కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
- April 20, 2018మనామా:హై క్రిమినల్ కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. బుడైయా హైవేపై ఓ పేలుడుకి సంబంధించిన కేసులో ఈ ముగ్గురూ దోషులుగా తేలారు. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చిందని చెప్పారు. హత్యకు యత్నించడం, పేలుడు పదార్థాల్ని వినియోగించేందుకు శిక్షణ పొందడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం, ఉపయోగించడం, విధ్వంసాలకు పాల్పడటం వంటి అభియోగాలు వీరిపై నిరూపించబడ్డాయి. నిందితుల్లో ఇద్దరి పౌరసత్వాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. అల్ కాదమ్ ట్రాఫిక్ లైట్ వద్ద బాంబుని వుంచి, పేల్చారు నిందితులు. అబు సైబా వద్ద బుడైయా హైవేపై ఈ పేలుడు చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం