మనామా:పేలుడు కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
- April 20, 2018మనామా:హై క్రిమినల్ కోర్టు ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. బుడైయా హైవేపై ఓ పేలుడుకి సంబంధించిన కేసులో ఈ ముగ్గురూ దోషులుగా తేలారు. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ చీఫ్ అటార్నీ జనరల్ అహ్మద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, న్యాయస్థానం వారిని దోషులుగా తేల్చిందని చెప్పారు. హత్యకు యత్నించడం, పేలుడు పదార్థాల్ని వినియోగించేందుకు శిక్షణ పొందడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం, ఉపయోగించడం, విధ్వంసాలకు పాల్పడటం వంటి అభియోగాలు వీరిపై నిరూపించబడ్డాయి. నిందితుల్లో ఇద్దరి పౌరసత్వాన్ని కూడా న్యాయస్థానం రద్దు చేసింది. నిందితులు విచారణలో తమ నేరాన్ని అంగీకరించారు. అల్ కాదమ్ ట్రాఫిక్ లైట్ వద్ద బాంబుని వుంచి, పేల్చారు నిందితులు. అబు సైబా వద్ద బుడైయా హైవేపై ఈ పేలుడు చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!