క్రిస్ గేల్కి అరుదైన గౌరవం
- April 21, 2018కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్లోని బెల్ని మోగించి గేల్ మ్యాచ్ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ 11వ సీజన్లో జరిగిన మ్యాచుల్లో కింగ్స్ పంజాబ్ జట్టు తరఫున గేల్ రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 103 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్ ఆడుతున్న గేల్ ఈడెన్ గార్డెన్స్లో బెల్ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గతంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ రాహుల్ ద్రవిడ్ సహా బ్రెట్ లీ, షేన్ వార్న్ తదితరులు ఈ బెల్ మోగించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్ గేల్ కూడా చేరాడు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ