నేడే 'నా పేరు సూర్య' ఆడియో లాంచ్
- April 21, 2018అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనేది టాగ్లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మిలిటరీ ఆఫీసర్గా దర్శనమీయనున్నాడు. బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్, టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి.
కాగా నేడు (ఆదివారం) ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ వేడుకలో అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్తో పాటు చిత్ర బృందం అంతా పాల్గొనబోతోంది. ఈ సినిమా మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు