తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

- April 23, 2018 , by Maagulf
తెలుగు దర్శకుడికి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

ప్రముఖ దర్శకుడు టీఎల్‌వీ ప్రసాద్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం 'దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ - 2018' పురస్కారం అందజేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన ఈ అవార్డు అందుకున్నారు. టీఎల్‌వీ ప్రసాద్‌ ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్‌రావు కుమారుడు. దాదాపు 85 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో 40 హిందీ చిత్రాలున్నాయి. మిథున్‌ చక్రవర్తితోనే ఏకంగా 35 చిత్రాలు తెరకెక్కించారు. ఓ తెలుగు దర్శకుడుబాలీవుడ్‌లో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడంతో ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకులతో చిత్రాల్ని తెరకెక్కించారు. బాలీవుడ్‌లో కొన్ని ధారావాహికలు కూడా నిర్మించారు. ప్రస్తుతం హిందీలో 'జై శ్రీకృష్ణ', 'జైజైజై భజరంగభళీ' సీరియల్స్‌ని తెరక్కిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com