ట్రంప్ వాణిజ్య యుద్ధ నివారణకు...-భారత్ మద్దతుకై చైనా ఆశాభావం
- April 23, 2018బీజింగ్: వాణిజ్య యుద్ధానికి దారితీసే విధంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కున్న చర్యలతో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు, భారత్ నుంచి సానుకూలత లభించగలదని చైనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మోడీ- జీ జిన్పింగ్ జరిపే భేటీ నేపథ్యంలో ఈ మేరకు బహిరంగ సంకేతాలు పంపింది. 'ఉభయదేశాలకు ఉమ్మడి ఆసక్తులు, లక్ష్యాలు, స్థితిగతులు ఉన్నాయి. విశ్వ విపణి అభివృద్ధికి వీలుగా తాజా ప్రపంచ పరిణామాలను వారు చర్చించగలరని, అందువల్ల భారత్ నుంచి మద్దతు లభిస్తుంది' అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లు-కాంగ్ విలేకరులకు తెలిపారు. అమెరికా 350 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటును భర్తీ చేసుకోవడానికి చైనా ఎగుమతులపై వరుసగా భారీ సుంకాలు విధిస్తుండటం తమకు అతిపెద్ద సవాలుగా నిలిచిందని ఆయన స్పష్టీకరించారు. ఈమేరకు ట్రంప్ చర్యలు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపగలవన్నారు. బీజింగ్ తన సొంత సుంకాలతో దీన్ని తిప్పికొట్టడానికి యత్నించిందని, కానీ అత్యధిక సరకుల విక్రేతగా చైనా ఎక్కువే కోల్పోతోందని తెలిపారు.
తాజా వార్తలు
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..