సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న అందాల భామ
- April 25, 2018అగ్రహీరోలతో నటించటమేకాదు..తమకంటు ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని వివాహానంతరం కొంతమంది..వేరే కారణాలతో మరికొంతమంది సినిమా పరిశ్రమకు దూరమైన అనంతరం కొంత విరామం తరువాత మళ్లీ సినిమాలలోకి రావటం మామూలే. కొంతమంది రీ ఎంట్రీతో మళ్లీ సక్సెస్ బాటలో వుంటే ఇంకొందరు వచ్చిన పాత్రలతో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ఇస్తానంటే సంకేతాలు ఇస్తోంది.
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన నిన్నటి తరం కథానాయికలలో అంజలా జవేరి ఒకరు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ ల సరసన కథానాయికగా చేసిన ఆమె .. చక్కటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్న అంజలా జవేరీ సినిమాలకు దూరం వున్నారు. విరామం అనంతరం ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానని అంటున్నారు.
తెలుగులో నిన్నటి తరం కథానాయికలుగా ఒక వెలుగు వెలిగిన నదియా .. భూమిక .. సిమ్రాన్ .. ఖుష్బూ .. మీనా రీ ఎంట్రీ ఇచ్చారు. భారీ పారితోషికాన్ని అందుకోవడంతో పాటు, మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. మరి వారిని చూసి స్ఫూర్తిని పొందిందో ఏమో తెలియదు గానీ, మంచి కథతో .. అవార్డులు తెచ్చిపెట్టే పాత్రలతో వస్తే చేయడానికి తాను సిద్ధంగా వున్నానని అంజలా జవేరి చెప్పుకొచ్చారు. వెంకటేశ్,చిరంజీవి వంటి అగ్రహీరోలతో చేసిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలా జవేరీ రీ ఎంట్రీ ఎలా వుండనుందో వేచి చూడాలి.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం