కొత్త బస్ రూట్ని ప్రారంభించిన మవసలాత్
- April 26, 2018మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాత్, కొత్త మస్కట్ - ఇబ్రి - బురైమి రూట్ని ప్రారంభించింది. ఏప్రిల్ 27 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మరింతగా విస్తరించే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త రూట్స్ని ప్రారంభిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్లు అత్యంత భద్రతతో కూడుకున్నవని అధికారులు తెలిపారు. అల్ అజైబా స్టేషన్, మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, అల్ సహవా టవర్, నిజ్వా మార్కెట్, బాహ్లా మార్కెట్, ఇబ్రి, ధనక్ రౌండెబౌట్, సునయ్నాహ్ మీదుగా బురైమి చేరుకుంటాయి. టిక్కెట్లను బస్లోగానీ, కంపెనీ కార్యాలయంలోగానీ పొందవచ్చు. మస్కట్ - ఇబ్రి - బురైమి లైన్లో రోజుకి రెండు ట్రిప్స్ ఈ బస్సులు నడుస్తాయి. తొలి బస్ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 నిమిషాలకు చేరుకుంటుంది. బురైమీ చేరుకునేసరికి సమయం 4 గంటలవుతుంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్