అసలే మ్యాచ్ పోయింది. ఆపై రూ.12 లక్షల ఫైన్
- April 26, 2018ఐపీఎల్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో భారీ స్కోర్ చేసినా చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. అసలే మ్యాచ్ పోయిన బాధతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉంటే. మూలుగే నక్కపై తాటిపండు పడ్డ చందగా విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా కెప్టెన్ కోహ్లీకి రూ.12 లక్షల ఫైన్ వేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసినా. 82 పరుగులతో అంబటి రాయుడు, 70 పరుగులతో ఎంఎస్ ధోనీ చెలరేగడంతో చెన్నై విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద కనీస ఓవర్-రేట్కు సంబంధించి కోహ్లీకి రూ.12లక్షల జరిమానా విధించినట్టు ప్రకటించింది ఐపీఎల్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ