జయ సమాధి తవ్వడం తప్పదా..?
- April 26, 2018జయలలిత తన తల్లినంటూ బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ దాఖలు చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. అమృత పిటీషన్ ను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు డీఏఎన్ పరీక్ష కోసం రక్తం వంటి బయాలాజికల్ (జీవ సంబంధిత) శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా అపోలో హాస్పిటల్స్ ను ఆదేశించింది. తమ వద్ద జయలలితకు సంబంధించిన బయలాజికల్ శాంపిల్స్ ఏవీ లేవని హాస్పిటల్ కోర్టుకు తెలిపింది. చాలా రోజుల తరవాత హాస్పిటల్ దాఖలు చేసిన అఫడవిట్ ఇపుడు ఈ కేసులో కీలకంగా మారనుంది. ఆమెకు సంబంధించి ఎలాంటి నమూనాలు తమ వద్ద లేవని స్పష్టం చేయడంతో.. కోర్టు మున్ముందు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.జయ మృతికి సంబంధించి ఎలాంటి విచారణ వద్దని ఒకవైపు ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాధి తవ్వి ఆమె అవశేషాలు తీసి పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశిస్తుందా? అన్న టెన్షన్ ఆమె అభిమానుల్లో నెలకొంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి