జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న "సాక్ష్యం"
- April 27, 2018బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాక్ష్యం". అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. సినిమా టీజర్ ప్రేక్షకుల్లో కథపై క్రేజ్ ను, అంచనాలను పెంచింది. యూట్యూబ్ లో ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ క్రేజీ యాక్షన్ ఫిలిమ్ ను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. "ఈ సినిమాతో అందరూ శ్రీవాస్ లోని కొత్త యాంగిల్ ను చూస్తారు. సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రకృతిని కేంద్రబిందువుగా చేసుకొని శ్రీవాస్ రాసుకొన్న స్క్రీన్ ప్లే సినిమాకి హైలైట్ గా నిలిస్తుంది. ఇటీవలే అమెరికా షెడ్యూల్ పూర్తయ్యింది. దుబాయ్, వారణాసి, అమెరికాలోని ఎగ్జాటిక్ లొకేషన్స్ లో షూటింగ్ ఫినిష్ చేశాం. ఇవాల్టినుంచి రాజమండ్రిలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ ఫినిష్ అయినట్లే. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసి జూన్ 14న ప్రేక్షకులకు సినిమాను అందిస్తాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మేకోవర్, టెక్నికల్ అంశాలు, వి.ఎఫ్.ఎక్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే విధంగా సినిమా ఉంటుందని గర్వంగా చెప్పగలను" అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: ఏ.ఎస్.ప్రకాష్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సినిమాటోగ్రఫీ: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హైన్స్, సంగీతం: హర్షవర్ధన్, నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా, రచన-దర్శకత్వం: శ్రీవాస్!
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







