తేనె, ఎండు ఖర్జూరాల మిశ్రమం.. కొవ్వుని కరిగించే ఆయుధం
- April 27, 2018
తేనె శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉండడం వలన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అలాగే ఎండు ఖర్జూరాల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. మరి ఈ రెండు కలిపి తింటే శరీరానికి మరింత ఉపయోగం. ఓ వారం రోజుల పాటు తేనెలో నానబెట్టిన ఎండు ఖర్జూరాలు ఉంచి రోజుకో మూడు తింటే దాని వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..
ఓ గాజు సీసాలో సగానికి పైగా తేనెను తీసుకోవాలి. అందులో విత్తనాలు తీసిన ఎండు ఖర్జూరాలను వేయాలి. తరువాత మూత గట్టిగా బిగించి తేనె, ఖర్జూరాలు బాగా కలిసేలా షేక్ చేయాలి. వారం రోజులు పక్కన ఉంచాలి. మధ్య మధ్యలో షేక్ చేస్తుంటే బాగా నానే అవకాశం ఉంటుంది. వారం తరువాత రోజుకి రెండు లేదా మూడు ఖర్జూరాలు తింటే మంచిది.
1. ఇలా తినడం వలన దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. తరుచుగా వేధించే ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
2.నిద్ర లేమితో బాధ పడే వారికి మంచి మందు. ఒత్తిడి, ఆందోళన కూడా దూరమవుతుంది. శరీరంపై ఏవైనా గాయాలుంటే త్వరగా మానుతాయి.
3. చిన్నారులు రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరిగి చదివినది బాగా గుర్తుంటుంది. మహిళలకు కావలసిన కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. రక్త హీనతను నివారించి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి.
4.సీజనల్ వ్యాధులను, అలర్జీలను నివారిస్తుంది. పలు రకాల క్యాన్సర్ కారకాలను దరిచేరనీయకుండా ఈ మిశ్రమం పనిచేస్తుంది.
5.జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. పేగుల్లోని చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.
6.రక్త హీనత ఉన్నవారికి మేలు చేస్తుంది. బీపీ, గుండె సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. శరీరంలో అధికంగా పేరుకున్న కొవ్వుని తొలగించి శరీర బరువుని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







