నిరుద్యోగులకు ఈ 30న జాబ్మేళా
- April 28, 2018
హైదరాబాద్: సామ రంగారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నగరంలోని వనస్థలిపురం పనామా చౌరస్తాలో గల బొమ్మిడి లలితా గార్డెన్స్లో జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సామ రంగారెడ్డి తెలిపారు. ఏడు, పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీఫార్మా, ఎంఫార్మా, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఎంఎల్టీ, బీపీటీ చేసిన వారితో పాటు చదువులేని వారికి సైతం ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతాయని పేర్కొన్నారు. జాబ్మేళాలో ఐసీఐసీఐ బ్యాంకు, ఏఆర్కే టెక్నాలజీస్, సన్లైన్ బిజినెస్ సొల్యూషన్స్, ధ్రువ్ కన్సల్టింగ్, క్యాంపస్ మార్గ్, హెడీబీ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, శుభగృహ, ఆవాస కన్సల్టింగ్, టెక్ మహీంద్ర, కొటక్ మహీంద్ర, కార్వీఫోర్డ్ తదితర సంస్థలు పాల్గొని అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







