ఆ విషయంపై చంద్రబాబుతోనూ చర్చిస్తాను: ముఖ్యమంత్రి కెసిఆర్
- April 29, 2018
దేశంలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో భేటీ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. సమాఖ్య వ్యవస్థతోనే భారత్కు మనుగడ అన్నారు కేసీఆర్. థర్డ్ ఫ్రంట్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు కలిసి రావాలన్నారు. చాలా అంశాలపై స్టాలిన్తో చర్చించామన్నారు. ఈ భేటీలను రాజకీయ కోణంలో కాకుండా.. దేశాభివృద్ధికి సరికొత్త దిక్సూచిగా చూడాలన్నారు కేసీఆర్. జాతీయ పార్టీలు మౌలిక వసతులు కల్పించలేకపోయాయని, రాష్ట్రాలకు మరింతగా అధికారాలు, నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. మే 10న తెలంగాణకు రావాలని స్టాలిన్ను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఫ్రంట్ విషయమై మరో రెండు మూడు నెలల తర్వాత ఓ క్లారిటీ వస్తుందని కేసీఆర్ అన్నారు. ఫ్రంట్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS







