భూకంపం అనుకున్నారు.. కానీ..?
- April 30, 2018
నిన్న రాత్రి పది, పదకొండు సమయంలో టర్కీ, లెబనాన్లలోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.6గా నమోదైంది.. ఇంట్లోని సామానులు, ఫర్నిచర్లో కదలికలు రావడంతో.. ప్రజలు ప్రాణభయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన భూకంప పరిశోధన కేంద్రం.. భూకంప కేంద్రాన్ని గుర్తించేపనిలో పడగా అసలు నిజం తెలిసింది. ఇది ప్రకృతిపరంగా సంభవించిన భూకంపం కాదని తేలింది. సరిగ్గా ఇదే సమయంలో ఇజ్రాయిల్ సైన్యం సిరియాపై భీకర వైమానిక దాడులు చేసింది. దక్షిణ హమాలోని 47వ మిలిటరీ బ్రిగేడ్ కాంపౌండ్ పై అత్యంత శక్తివంతమైన క్షిపణులతో దాడి చేయడంతో.. తీవ్రస్థాయిలో ప్రకంపనలు సంభవించాయి.. దీని ప్రభావంతో సిరియా సరిహద్దున ఉన్న టర్కీ, లెబనాన్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భూకంపం చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!
- ఎన్టీఆర్కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..







