భారత దేశం అగ్నికి ఆహుతి అవుతోందట
April 30, 2018
భారత దేశం మండిపోతందని నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విడుదల చేసిన ఫొటోలు చెబుతున్నాయి. నాసాకు చెందిన ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.. ఎప్పటికప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్న ప్రాంతాల ఫొటోలను తీస్తుంటుంది దేశంలో పెరిగిపోతున్న పంటల దహనాల వల్ల కలుగుతున్న నష్టాన్ని ఇటీవల విడుదల చేసిన ఫొటోలు కళ్లకు కట్టాయి. ఉత్తర, మధ్య భారత్లో ఈ లొకేషన్స్ పెద్ద సంఖ్యలో ఉండగా.. దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది