జర్నలిస్టులే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు
- April 30, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ఐఎస్ ఉగ్రవాదులు మరో మారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో 25 మంది మృతిచెందారు. ఐతే వివరాల్లోకి వెల్తే మొదటి బాంబు పేలడంతో ఆ సఘటనను కవర్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో మీడియా ప్రతినిధులు ,రిపోర్టర్లు వెళ్లారు. వాళ్లు అక్కడికి చేరుకోగానే ఆత్మాహుతి దాడికి సిద్ధమైన రెండో వ్యక్తి పేలుడు పదార్ధాలతో పేల్చుకున్నాడు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీస్ అధికారి వెల్లడించారు. మృతిచెందిన 8 మంది జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారని, మరో ఆరుగురు పాత్రికేయులు తీవ్రంగా గాయపడ్డారని జర్నలిస్టు సేఫ్టీ కమిటీ పేర్కొంది. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







