జర్నలిస్టులే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు
- April 30, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ఐఎస్ ఉగ్రవాదులు మరో మారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో 25 మంది మృతిచెందారు. ఐతే వివరాల్లోకి వెల్తే మొదటి బాంబు పేలడంతో ఆ సఘటనను కవర్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో మీడియా ప్రతినిధులు ,రిపోర్టర్లు వెళ్లారు. వాళ్లు అక్కడికి చేరుకోగానే ఆత్మాహుతి దాడికి సిద్ధమైన రెండో వ్యక్తి పేలుడు పదార్ధాలతో పేల్చుకున్నాడు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీస్ అధికారి వెల్లడించారు. మృతిచెందిన 8 మంది జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారని, మరో ఆరుగురు పాత్రికేయులు తీవ్రంగా గాయపడ్డారని జర్నలిస్టు సేఫ్టీ కమిటీ పేర్కొంది. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









