జర్నలిస్టులే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు
- April 30, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ఐఎస్ ఉగ్రవాదులు మరో మారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో 25 మంది మృతిచెందారు. ఐతే వివరాల్లోకి వెల్తే మొదటి బాంబు పేలడంతో ఆ సఘటనను కవర్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో మీడియా ప్రతినిధులు ,రిపోర్టర్లు వెళ్లారు. వాళ్లు అక్కడికి చేరుకోగానే ఆత్మాహుతి దాడికి సిద్ధమైన రెండో వ్యక్తి పేలుడు పదార్ధాలతో పేల్చుకున్నాడు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీస్ అధికారి వెల్లడించారు. మృతిచెందిన 8 మంది జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారని, మరో ఆరుగురు పాత్రికేయులు తీవ్రంగా గాయపడ్డారని జర్నలిస్టు సేఫ్టీ కమిటీ పేర్కొంది. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







