జర్నలిస్టులే లక్ష్యంగా ఆత్మాహుతిదాడులు
- April 30, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ రక్తసిక్తమైంది. ఐఎస్ ఉగ్రవాదులు మరో మారు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఘటనలో 25 మంది మృతిచెందారు. ఐతే వివరాల్లోకి వెల్తే మొదటి బాంబు పేలడంతో ఆ సఘటనను కవర్ చేయడానికి ఎక్కువ సంఖ్యలో మీడియా ప్రతినిధులు ,రిపోర్టర్లు వెళ్లారు. వాళ్లు అక్కడికి చేరుకోగానే ఆత్మాహుతి దాడికి సిద్ధమైన రెండో వ్యక్తి పేలుడు పదార్ధాలతో పేల్చుకున్నాడు. జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీస్ అధికారి వెల్లడించారు. మృతిచెందిన 8 మంది జర్నలిస్టులు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వారని, మరో ఆరుగురు పాత్రికేయులు తీవ్రంగా గాయపడ్డారని జర్నలిస్టు సేఫ్టీ కమిటీ పేర్కొంది. ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









