సౌదీలో ఆ దాడి చేసింది భారతీయుడే!
- April 30, 2018
రియాద్ : సౌదీ అరేబియాలోని జెడ్డా ప్రాంతంలో రెండేళ్ల క్రితం ఆత్మాహుతి దాడికి పాల్పడింది భారతీయుడేనని సౌదీ ప్రభుత్వం నిర్ధారించింది. 2016 జూలై 4 వ తేదీన సౌదీలోని మూడు ప్రాంతాల్లో నలుగురు లష్కరే తోయిబా తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు దిగారు. ఈ దాడుల్లో భాగంగా సౌదీ పశ్చిమ ప్రాంతంలోని యూఎస్ కాన్సులేట్ వెలుపల ఆత్మహుతి దాడి జరిపింది భారతీయుడైన ఫయాజ్ కాగ్జీ అని ఆరోపణలు వచ్చాయి. దీంతో సౌదీ అధికారులు ఆ దాడి దృశ్యాలను భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు పంపి.. నిందితుడి వివరాలు పంపాల్సిందిగా కోరారు.
దీంతో ఎన్ఐఏ ఆదేశాలతో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు కాగ్జీ డీఎన్ఏ నమూనాలను 2017లో సౌదీ అధికారులకు అందజేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి డీఎన్ఏతో ఇది సరిపోలడంతో.. ఆ దాడికి పాల్పడింది కాగ్జీనే అని సోమవారం సౌదీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. మహారాష్ట్రకు చెందిన కాగ్జీ 2006లో పాకిస్తాన్కు వెళ్లి.. అక్కడ లష్కరే తోయిబాలో చేరి పలు విధ్వంసాలకు పాల్పడ్డాడు. 2006లో జౌరంగాబాద్ అక్రమ ఆయుధాల రవాణా కేసులో కాగ్జీ ప్రధాన నిందితుడు. అలాగే 26/11 ముంబై దాడులకు కాగ్జీనే సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









