200 కోట్ల క్లబ్లో చేరిన 'రంగస్థలం'
- April 30, 2018రంగమ్మా మంగమ్మా ఇంకా వినిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ రంగస్థలం రికార్డులను బ్రేక్ చేస్తూ 200 కోట్ల క్లబ్లో చేరింది. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మార్చి 30 న విడుదలై నెల రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ సినిమాకు అన్నీ ప్లస్ పాయింట్లే కావడం రికార్డులు సృష్టించడానికి కారణమైంది. సుకుమార్ డైరక్షన్, రాంచరణ్ యాక్షన్తో మిగిలిన తారాగాణమంతా కథకు చక్కగా సరిపోయారు. అందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అన్నింటికీ మించి దేవీ శ్రీ మ్యూజిక్, దానికి తోడు చంద్రబోస్ సాహిత్యం. ఒక్కటేమిటి అన్నీ కలిసొచ్చి అంశాలు రంగరించి రంగస్థలాన్ని నిర్మించారు. అందుకే అభిమానులు ఆదరించి పట్టం కట్టారు. భారీ స్థాయిలో నిర్మాతలకు విజయాన్ని అందించిన రంగస్థలం, 200 ల కోట్ల క్లబ్లో చేరి రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ రికార్డులు నెలకొల్పిన చిత్రంగా నిలిచిపోతుంది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!