200 కోట్ల క్లబ్లో చేరిన 'రంగస్థలం'
- April 30, 2018
రంగమ్మా మంగమ్మా ఇంకా వినిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ రంగస్థలం రికార్డులను బ్రేక్ చేస్తూ 200 కోట్ల క్లబ్లో చేరింది. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మార్చి 30 న విడుదలై నెల రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ సినిమాకు అన్నీ ప్లస్ పాయింట్లే కావడం రికార్డులు సృష్టించడానికి కారణమైంది. సుకుమార్ డైరక్షన్, రాంచరణ్ యాక్షన్తో మిగిలిన తారాగాణమంతా కథకు చక్కగా సరిపోయారు. అందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అన్నింటికీ మించి దేవీ శ్రీ మ్యూజిక్, దానికి తోడు చంద్రబోస్ సాహిత్యం. ఒక్కటేమిటి అన్నీ కలిసొచ్చి అంశాలు రంగరించి రంగస్థలాన్ని నిర్మించారు. అందుకే అభిమానులు ఆదరించి పట్టం కట్టారు. భారీ స్థాయిలో నిర్మాతలకు విజయాన్ని అందించిన రంగస్థలం, 200 ల కోట్ల క్లబ్లో చేరి రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ రికార్డులు నెలకొల్పిన చిత్రంగా నిలిచిపోతుంది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









