115 మంది టెర్రరిస్టులకు జైలు
- May 16, 2018మనామా: జుల్ఫికర్ బ్రిగేడ్ అనే టెర్రరిస్ట్ సంస్థకి చెందిన 115 మంది టెర్రిస్టులకు 3 ఏళ్ళ నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్షల్ని ఖరారు చేసింది న్యాయస్థానం. వీరి పౌరసత్వాన్ని సైతం న్యాయస్థానం రద్దు చేసింది. ఈ 115 మందిలో 53 మందికి జీవిత ఖైదు విధించారు. ముగ్గురికి 15 ఏళ్ళ జైలు శిక్ష, ఒకరికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 15 మందికి ఏడేళ్ళ జైలు శిక్ష, 37 మందికి ఐదేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసిందని చీఫ్ ప్రాసిక్యూటర్, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హమాద్ షహీన్ చెప్పారు. ఈ కేసు నుంచి 23 మంది అనుమానితులకు నిర్దోషులుగా ఊరట కల్పించింది న్యాయస్థానం. 138 మంది సభ్యులతో తీవ్రవాద సంస్థను నడుపుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. 83 మంది నిందితుల్ని వారి డిఫెన్స్ లాయర్స్ సమక్షంలో విచారించడం జరిగింది. ఇందులో ఆరుగురు మినహా మిగతావారంతా తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?