'వర్జిన్' ఓడ పెద్దవాళ్లకు మాత్రమే..
- May 26, 20182,750 మంది ప్రయాణీకులు ఒకేసారి ఆ ఓడలో ప్రయాణిస్తూ సముద్రపు అందాలను వీక్షించొచ్చు. బ్రిటన్కు చెందిన పారిశ్రామిక వేత్త రిచర్డ్ బ్రాన్ సన్ ఓ బ్రహ్మాండమైన క్రూజ్ షిప్ను 2020 కల్లా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరేబియన్ దీవుల నుంచి మయామీ వరకు సముద్ర యానం చేయానుకునేవారికి ఈ షిప్ చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. అన్ని ఆధునిక హంగులు ఈ షిప్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఈ ఓడలో మరీ ఓల్డ్ కాదు మరీ యంగ్ కాదు.. ఎంట్రీ ఓన్లీ ఫర్ అడల్ట్కి మాత్రమే అంటున్నారు తయారీదారులు. అందుకే షిప్కి వర్జిన్ అని పేరు పెట్టారు. ప్రయాణంలో కొత్త అనుభూతుల్ని కోరుకునే వారికి మా ఓడలో ప్రయాణం మరింత ఆనందాన్నిఇస్తుందంటున్నారు. 93 శాతం సముద్ర దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా అత్యధికంగా బాల్కనీలు ఏర్పాటు చేసారు. లోపల నచ్చిన ఫుడ్డూ, మెచ్చిన బెడ్డూ అన్నీ అందుబాటులో ఉంటాయట. రెస్టారెంట్లు, క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఓహ్.. ఒకటేమిటి అన్నీ మీ కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. స్వర్గమేమో కదా ఇది అని అనిపించకమానదు అని అంటున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు