మెకును తుపాన్‌ ఎఫెక్ట్‌: 12 ఏళ్ళ బాలిక మృతి చెందింది

- May 26, 2018 , by Maagulf
మెకును తుపాన్‌ ఎఫెక్ట్‌: 12 ఏళ్ళ బాలిక మృతి చెందింది

మస్కట్‌: సైక్లోన్‌ మెకును గాలుల ధాటికి ఓ విద్యార్థిని గోడకు బలంగా గుద్దుకుని, తీవ్ర గాయాల పాలయి మృతి చెందింది. సుల్తాన్‌ కబూస్‌ ఆసుపత్రిలో బాలిక తుది శ్వాస విడిచిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించారు. తుపాను నేపథ్యంలో దోఫార్‌ రెసిడెంట్స్‌, అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్‌ చేయొద్దని వారు హెచ్చరించారు. కేటగిరీ 2కి చెందిన తుపాను మెకును కారణంగా భారీ వర్షాలు, భయంకరమైన వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు సురక్షితమైన ప్రాంతాల్లో వుండాలని ప్రజలకు అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com