అలనాటి నటి గీత కపూర్ ఇకలేరు..
- May 26, 2018అలనాటి బాలీవుడ్ నటి గీతా కపూర్(57) వృద్ధాశ్రమంలో శనివారం కన్నుమూశారు. అయిన వాళ్ళ ఆదరణకు నోచుకోని గీత కపూర్ ఏళ్ల తరబడి వృద్ధాశ్రమంలో గడిపారు.దాదాపు 50 చిత్రాల్లో నటించిన ఆమె చివరివరకు కొడుకు కూతురి జాడకోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ మధ్యలోనే వారిని చూడకుండా మరణించిందని ఆమె అభిమాని అశోక్ పండిట్ వెల్లడించాడు. గీతా కపూర్ కు కొడుకు, కూతురు ఉన్నారని వారు ఆమెను ఆదరించలేదని కొడుకు గీతా కపూర్ ను చిత్రహింసలకు గురిచేసి నాలుగురోజులకు ఒకసారి అన్నం పెట్టేవాడని దాంతో ఆమె అనారోగ్యం పాలైంది.ఆ సమయంలో ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి తెలుసుకున్న తాను ఆసుపత్రి బిల్లులు కట్టి గీతా కపూర్ ను వృద్ధాశ్రమంలో చేర్పించానని అశోక్ పండిట్ అన్నారు.కానీ వృద్ధాశ్రమంలో ఉన్నంతకాలం కొడుకు కూతురుకోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిందని కానీ వారు రాలేదని తీవ్రంగా దుఃక్కించేదని... ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకుని కన్నుమూశారని అన్నారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రిలో ఉంచాం. ఆమె తరుపువారు ఎవరైనా వస్తారేమో రెండు రోజులపాటు ఎదురుచూస్తాం. రానిపక్షంలో మేమే అంత్యక్రియలు జరిపిస్తాం’ అని అశోక్ పండిట్ తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు