'రంజాన్ తర్వాత కూడా కాల్పుల విరమణ కొనసాగిస్తాం'

- May 26, 2018 , by Maagulf
'రంజాన్ తర్వాత కూడా కాల్పుల విరమణ కొనసాగిస్తాం'

పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌ వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అయితే, ఈ విషయంలో దాయాది దేశం కొంత చొరవ చూపి చొరబాటు యత్నాలను ఆపడం, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉమ్మడి చర్యను చేపట్టడం ద్వారా తన ఉద్దేశాన్ని చాటాలని ఆయన సూచించారు. రంజాన్‌ తర్వాత కూడా కాల్పుల విరమణను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు చేపట్టిన మధ్యవర్తుల నియామకం అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదని ఆయన అంగీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com