ఘనంగా ప్రారంభమైన మహానాడు
- May 27, 2018తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు , నేతలు ఎంతో ఘనంగా జరుపుకునే మహానాడు వేడుక ఈరోజు విజయవాడలోని కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర ప్రాంతాలనుండి కూడా భారీగా కార్య కర్తలు , అభిమానులు చేరుకున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనుంది.
మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు డ్వాక్రా బజార్, ఫోటో ప్రదర్శన ప్రారంభించి.. తిలకించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. రక్తదాతలను అభినందించారు.మహానాడులో మొత్తం 36 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వివిధ అంశాల్లో కేంద్రం వైఖరిని ఖండించేందుకే ప్రత్యేకంగా నాలుగు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. మహానాడు సందర్భంగా విజయవాడ నగరం అంత పసుపు మాయంగా మారింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ