చెర్రీ, తారక్ల మల్టీస్టారర్ సినిమాపై ఆసక్తికర కథనం!
- June 01, 2018తారక్, చెర్రీలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీపై రోజుకో వార్త చక్కర్లుకొడుతుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే అభిమానుల్లో సినిమా సందడి మొదలైపోయింది. రూ.300 కోట్ల బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా రాజమౌళి ఈ మూవీ స్టోరీ గురించి సింగల్ లైన్ కూడ చెప్పకముందే ఈ సినిమా కథకు సంబందించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ మూవీలో చెర్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఆయన సోదరుడిగా తారక్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారంటూ టాలీవుడ్ టాక్. అంతేగాక ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్గా ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వార్తలన్నీ నిజమో కాదో తెలియాలంటే జక్కన్న నోరు విప్పాల్సిందే.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు