యూఏఈ వీసా ఆన్ అరైవల్: ఇండియన్స్కి అర్హత ఎలాగంటే..
- June 13, 2018దుబాయ్ రెసిడెన్సీ అథారిటీ, యూఏఈ వీసా ఆన్ అరైవల్ పొందేందుకు ఇండియన్స్ ఏం చేయాలో వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈద్ అల్ ఫితర్ దగ్గరవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో యూఏఈ రావాలనుకునే భారతీయులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్కి సంబంధించి రిమైండర్ని జారీ చేసింది. యునైటెడ్ కింగ్డమ్ లేదా యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన రెసిడెన్సీ వీసా వున్నవారికి, అమెరికన్ వీసా లేదా గ్రీన్ కార్డ్ వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ వర్తిస్తుంది. అయితే రెసిడెన్సీ వీసాలు 6 నెలలకు పైబడి చెల్లుబాటయ్యేలా వుడాలి. ఎంట్రీ పర్మిషన్ కోసం 100 దిర్హామ్ల రుసుముని, అలాగే 20 దిర్హామ్లు సర్వీసు ఫీ ఛార్జ్గానూ చెల్లించాల్సి వుంటుంది. ఇలా వీసా ఆన్ అరైవల్ పొందేవారికి అత్యధికంగా 14 రోజులపాటు యూఏఈలో స్టే చేసే అవకాశం వుంది. దీన్ని మరోసారి పొడిగించుకునేందుకూ అవకాశం వుంది. దీనికోసం 250 దిర్హామ్ల రెన్యువల్ ఫీజు, 20 దిర్హామ్ల సర్వీసు ఫీజు చెల్లించాలి. ఎక్స్టెన్షన్ పొందేవారికి 28 రోజులు స్టే చేసే అవకాశం లభిస్తుంది. ఓవర్ స్టేయింగ్కి (ఒక రోజుకి) 100 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ