వందలాది మొసళ్లను కొట్టిచంపేశారు
- July 16, 2018సొరోంగ్: ఇండోనేషియాలో ఓ వ్యక్తి ప్రాణం తీశాయన్న కోపంతో స్థానికులు వందలాది మొసళ్లను ఒక్కపెట్టున కొట్టి చంపిన వైనమిది. పపువా ప్రావిన్స్లోని సొరోంగ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. 45 ఏళ్ల బాధితుడు సుగిటో అంత్యక్రియల అనంతరం మొసళ్లపై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. జనావాసాల్లో మొసళ్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ క్రోకోడైల్ ఫామ్పై మూకుమ్మడి దాడి చేశారు. పశువులకు గడ్డి తెచ్చేందుకు వెళ్లిన బాధితుడు.. ప్రమాద వశాత్తూ జారి మొసళ్లను పెంచుతున్న ఎన్క్లోజర్లో పడ్డాడు. తొలుత మొసళ్లు ఆయన కాలిని బలంగా కొరికి గాయపర్చగా... ఓ మొసలి తన తోకతో ఆయనను గట్టిగా ఒడిసిపట్టుకుంది.
రెసిడెన్సియల్ ప్రాంతంలో మొసళ్ల ఫామ్ ఉండడంపై సుగిటో బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడికి నష్టపరిహారం చెల్లించేందుకు ఫామ్ యాజమాన్యం అంగీకరించినట్టు అధికారులు వారితో చెప్పారు. అయితే దీనిపై సంతృప్తి చెందని మృతుడి బంధువులు వందలాదిగా కత్తులు, గడ్డపారలతో క్రోకోడైల్ ఫామ్పై దాడి చేశారు. నాలుగు అంగుళాల పొడవు నుంచి రెండు మీటర్ల పొడవున్న పెద్ద మొసళ్ల వరకు మొత్తం 292 మొసళ్లను చంపేశారని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు