ఇండియన్‌ బ్యాంకర్‌ యు.ఏ.ఈలో మృతి

- July 17, 2018 , by Maagulf
ఇండియన్‌ బ్యాంకర్‌ యు.ఏ.ఈలో మృతి

యు.ఏ.ఈ:వారం రోజులుగా కన్పించకుండా పోయిన బ్యాంక్‌ ఉద్యోగి మృతదేహం వెలుగు చూసింది. గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో ఈ మృతదేహాన్ని భద్రపరచగా, సోషల్‌ వర్కర్స్‌, కమ్యూనిటీ గ్రూప్స్‌ మృతుడెవరన్నదాన్ని గుర్తించేందుకు ప్రయత్నించడం జరిగింది. కాగా, సోమవారం మధ్యాహ్నం మృతుడి సోదరుడు, తన సోదరుడి మృతదేహాన్ని గుర్తించడంతో అతని వివరాలు వెలుగు చూశాయి. అబుదబీలో భారతీయ వలసదారుడు జబర్‌ నివసిస్తున్నారు. ముస్సాఫ్పా ఇండస్ట్రియల్‌ ఏరియాలో అతని మృతదేహం కనుగొన్నారు. మృతుడు కేరళలోని కన్నూర్‌ జిల్లాకు చెందిన వ్యక్తి. తొమ్మిదేళ్ళుగా అబుదాబీలో నివాసముంటున్నాడీయన. ఎవరితోనూ తన సోదరుడికి గొడవలు లేవనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని మృతుడి సోదరుడు మునీర్‌ చెప్పారు. మునీర్‌ కూడా, తన సోదరుడితోనే కలిసి అదే బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. మృతుడు జబార్‌కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతికి గల కారణాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షలతో తెలుసుకోనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com