యు.ఏ.ఈ:ఈ ఉల్లంఘనకి పాల్పడితే 50,000 దిర్హామ్ల జరీమానా
- July 17, 2018యు.ఏ.ఈ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ క్రాఫ్ట్ ఓనర్లకు సంబంధించి జరీమానా రిమైండర్ని జారీ చేసింది. జెట్ స్కీ ఇంజిన్ నెంబర్ల టాంపరింగ్కి పాల్పడితే 50,000 దిర్హామ్ల వరకు జరీమానా విధించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పేర్కొంది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే జెట్ స్కీ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు, దాన్ని స్వాధీనం చేసుకోవడమూ జరుగుతుంది. బీచ్కి 200 మీటర్ల లోపల జెట్ స్కీ వినియోగిస్తే జరీమానా తప్పదు. పర్సనల్ వాటర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన నిబంధనల ప్రకారం మొదటి పెనాల్టీ 500 దిర్హామ్లు కాగా, రెండో పెనాల్టీకి 1000 దిర్హామ్లు చెల్లించాలి. మూడో పెనాల్టీకి 2000 దిర్హామ్ల జరీమానా విధించబడటమే కాకుండా వాహనాన్ని నెల రోజులపాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు