ఆఫీసులో వారానికోసారి 'స్టీమ్ బాత్'
- July 19, 2018ఉద్యోగం అనగానే చాలా మంది తన పై అధికారి వల్ల పని ఒత్తిడి పెరుగుతుందని, ఆఫీస్ టైం అయిపోయిన తరువాత కూడా గంటల కొద్దీ ఆఫీస్లోనే కూర్చోమనడం.. ఇలా బాస్ వల్ల వెంటాడే సమస్యలు చాలానే చెబుతారు ఉద్యోగులు..
కానీ ఆఫీసులో బాసుతో కలిసి నగ్నంగా ఓ రూమ్లో గంటల కొద్దీ గడపడం.. బాస్తో కలసి జలకాలు చేయటం వంటివి ఎప్పుడైనా విన్నారా.. ఇలాంటివి ఇక్కడ మామూలే అంటున్నారు ఉద్యోగులు.
జర్మనీ, హోలాండ్, ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఉద్యోగులు వాళ్ల కొలీగ్స్తో కలిసి స్టీమ్ బాత్ చేయటం చాలా సాధారణ విషయం. ఫిన్లాండ్లో అయితే వాళ్ల బాస్తో కలసి నగ్నంగా స్టీమ్ బాత్ చేస్తుంటారు.
బాస్తో కలిసి మహిళ ఉద్యోగులు నగ్నంగా మారి ఆఫీసులోనే సరాదాగా కబుర్లు చెప్పుకుంటారట. స్టీమ్ బాత్ రూమ్లో అయితే బాసు, ఎంప్లాయి అనే బేధాలు ఉండవు.. ఇగోలు కూడా ఉండవు. చాలా ఫ్రీగా మనసు విప్పి మాట్లాడుకోవడం.. ఒకరిని ఒకరు దగ్గర చేసుకోవటం మాత్రమే ఉంటాయంటున్నారు ఇక్కడ జాబ్ హోల్డర్స్.
55 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ప్రతి ఇద్దరికీ ఒక స్టీమ్ బాత్ రూమ్ ఉంటుంది. దీన్ని ఇక్కడ 'సానా' అని పిలుస్తుంటారు. చాలా కంపెనీలు తమ ఆఫీసుల్లోనే వీటిని ఏర్పాటు చేసుకున్నాయి.
ఫిన్లాండ్లో చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది ఈ స్టీమ్ బాత్ని ఇష్టపడుతుంటారు. వారంలో ఐదు రోజులు ఆఫీసులో కష్టపడి వర్క్ చేసి.. ఆ కష్టాన్ని మరచిపోయేలా 'సానా'లో గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తారట.. దీంతో వారు కొత్త ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుందని ఉద్యోగులు అంటున్నారు.
అయితే వీటిలోకి వెళ్లాలంటే కచ్చితంగా బట్టలు విప్పాల్సిందేనట. ఒంటిమీద నూలుపోగు కూడా ఉండకూడదట.
గత కొంతకాలంగా స్టీమ్ బాత్ రూమ్లో కబుర్లాడుకునే సంస్కృతి తగ్గుతోంది. దీనికి కారణం.. ఫిన్లాండ్లోని కంపెనీలన్నీ గ్లోబల్ కంపెనీలుగా మారుతుండటం, భిన్న సంస్కృతులకు చెందినవాళ్లు వీటిలో పనిచేస్తుండటం, పని ఒత్తిడి పెరుగుతుండటం వల్లే ఇలాంటి రూమ్లో టైం గడపడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదట.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం