మనామా:లిక్కర్ స్మగ్లర్స్ అప్పీల్ని తిరస్కరించిన న్యాయస్థానం
- August 10, 2018మనామా:200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన ఆల్కహాల్ని స్మగ్లింగ్ చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష విధించగా, వారి అప్పీల్ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నిందితులంతా ఆసియా జాతీయులే. వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 21 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురికి మూడు నెలల జైలు శిక్ష పడగా, వీరెవరూ తమ శిక్షను అప్పీల్ చేయడానికి ముందుకు రాలేదు. షిప్లో అక్రమంగా మద్యం బాటిళ్ళను దాచి, బహ్రెయిన్లోకి స్మగుల్ చేస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యంతోపాటుగా, 36,000 బహ్రెయినీ దినార్స్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం