'భారత్' సినిమా కాన్సెప్ట్ టీజర్ విడుదల
- August 15, 2018'భారత్' కాన్సెప్ట్ టీజర్ విడుదల ముంబయి: బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'భారత్'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తున్నారు. దిశా పటానీ సల్మాన్ సోదరిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా..ఈ రోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ను సల్మాన్ ట్విటర్ ద్వారా విడుదల చేశారు. 'ఈ భూమిపై కొన్ని బంధుత్వాలు ఉంటాయి. మరికొన్ని రక్తసంబంధాలు ఉంటాయి. కానీ నాకు ఆ రెండూ ఉండేవి' అంటూ సల్మాన్ చెప్తున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇందులో సల్మాన్ ఇంతకు ముందెన్నడూ చూడని ఓ కొత్త అవతారంలో దర్శనమిస్తారని తెలుస్తోంది. భారతదేశ సంస్కృతి, మూలాలను కళ్లకుకట్టేలా 'భారత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు జాఫర్ వెల్లడించారు. ఏడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కథ సాగుతుంది. అందులో భాగంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరపుతున్నారు. ఓ మనిషి, ఓ జాతి కలిసి చేసే ప్రయాణమే 'భారత్'.
వచ్చే ఏడాదిలో సల్మాన్కు బాగా కలిసొచ్చిన రంజాన్ రోజున ఈ చిత్రం విడుదలకానుంది
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు